Saturday, April 27, 2024

ఇన్‌ఫార్మర్‌ నెపంతో గిరిజనుడి హత్య

ఇన్ ఫార్మ‌ర్ నెపంతో గిరిజ‌నుడి హ‌త్యకు గురైన ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పెదబయలు మండలంలో గిరిజనుడి హత్య జరిగింది. ఇన్‌ఫార్మర్‌ నెపంతో ఎగువ తారాబు వద్ద గిరిజనుడిని హత్య చేశారు. మృతుడు బొంగజంగికి చెందిన కొర్రా లక్ష్మణరావు (30)గా గుర్తించారు. లక్ష్మణరావు గతంలో మావోయిస్టు దళంలో పనిచేశాడు. ఈ హత్య గురించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement