Monday, May 13, 2024

Vizag: విద్యుత్ షాక్ తో దంప‌తులు మృతి

విద్యుత్ షాక్ తో దంప‌తులు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఏపీలోని వైజాగ్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని అర‌కు లోయ విద్యుత్ క్వార్ట‌ర్స్ లో ఈ విషాద ఘ‌ట‌న జ‌రిగింది. స్నానం చేసేందుకు వెళ్లిన భ‌ర్త క‌రెంట్ షాక్ తో మృతిచెందాడు. అయితే భ‌ర్త‌ను కాపాడే ప్ర‌య‌త్నంలో భార్య కూడా మృతిచెందింది. మృతులు కంఠ‌బంసుగూడ వాసులు డొంబుదొర‌, పార్వ‌తిలు. ఈ ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డంతో ఆ ప్రాంతంలో విషాధ ఛాయ‌లు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement