Wednesday, July 24, 2024

Polling Day కుటుంబ సభ్యులతో కలసి ఓటు హక్కు వినియోగించుకున్న కెటిఆర్

హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నందినగర్‌లో కుటుంబసభ్యులతో కలిసి కేటీఆర్‌ ఓటేశారు. కేటీఆర్ తన సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షుతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అయితే హిమాన్షు గత కొంతకాలంగా అమెరికాలో చదువుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఓటు వేసేందుకు ఆయన నగరానికి వచ్చారు. హిమాన్షు ఈ ఎన్నికల్లో తన మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. తనలాగే మొదటిసారి ఓటు వేస్తున్న వారందరికి హిమాన్షు బెస్ట్ విషెస్ తెలిపారు. నేటి యువత తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement