Wednesday, May 8, 2024

గంగమ్మ తల్లికి సారె సమర్పించిన జల్లా కలెక్టర్

తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకట రమణా రెడ్డి తన కుటుంబ సమేతంగా శనివారం ఉదయం శ్రీ తాతాయ్య గుంట గంగమ్మ తల్లికి సారె సమర్పించారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, తుడా కార్యాలయం వద్ద నుంచి ఊరేగింపుగా ఆలయం వరకు తీసుకొచ్చారు. అనంతరం గంగమ్మ ఆలయ పాలక మండలి చైర్మన్ కట్టా గోపి యాదవ్, అర్చకులు వారికి అమ్మవారి ఆలయం ఎదుట స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టర్ కి అర్చకులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరికీ అమ్మవారి కృప మెండుగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రెండేళ్ల పాటు జాతర ఏకాంతంగా జరిగిందని, అయితే ఈ సారి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కృషితో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement