Tuesday, April 23, 2024

Flash: వృద్ధుడి దారుణ హత్య

సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని మోతె మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి గ్రామానికి జనార్దన్ రెడ్డి(60) అనే వృద్ధడు దారుణ హత్యకు గురైయ్యాడు. రాత్రి ఆరుబయట మంచంలో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవలితో గొంతుకోసి,కత్తితో పొడిచ్చి అత్యంత పాశవికంగా హత్య చేశారు. మునగాల సిఐ ఆంజనేయులు,మోతె ఎస్.ఐ ప్రవీణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, భూ తగాదాలే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement