Friday, April 26, 2024

రానున్న మూడు రోజులు రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : కనకనరసా రెడ్డి

రానున్న మూడు రోజులు భారీ వర్షాల నమోదుకు అవకాశమున్నందున తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్ లు అప్రమత్తంగా ఉండాలని ఆర్డిఓ కనకనరసా రెడ్డి తెలిపారు. ఆర్డీవో కార్యాలయంలో సిబ్బంది 24/7 అందుబాటులో వుంటారని తెలిపారు. తహసీల్దార్ లు తమ పరిధిలో అప్రమత్తంగా వుండి సూచనలు, సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఆర్డిఓ కార్యాలయానికి వివరాలు అందించాలని తెలిపారు. నీటి ప్రవాహం అధికంగా వున్న వాగులు, వంకలు ప్రజలు దాటరాదని సూచించారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగానికి సూచనలు చేశారని, కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement