Thursday, May 2, 2024

Breaking: హైద‌రాబాద్‌లో వ‌ర్షం.. ప‌లుచోట్ల నిలిచిన ట్రాఫిక్ జామ్‌

ఈశాన్య రుతుప‌వ‌నాల ఎఫెక్ట్ తెలంగాణ‌లోనూ క‌నిపిస్తోంది. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో మోస్త‌రు జ‌ల్లులు కురిశాయి. లంగ‌ర్‌హౌజ్‌, గోల్కొండ‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్ త‌దిత‌ర ప్రాంతాల్లో చిరు జ‌ల్లులు కురిశాయి. ఈవెనింగ్ ఆఫీసుల నుంచి ఇంటికెళ్తున్న ఉద్యోగులు హ‌టాత్తుగా వ‌ర్షం రావ‌డంతో ఇబ్బంది ప‌డ్డారు. దీంతో ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. ట్రాఫిక్ పోలీసులు ఎక్క‌డికక్క‌డ వాహ‌నాలు నిలిచి ట్రాఫిక్ స్తంభించ‌కుండా చ‌ర్య‌లు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement