Wednesday, May 22, 2024

యువగళం సభ ఆవరణంలో తెలుగు తమ్ముళ్ల ఘర్షణ

-కోసిగి.ఏప్రిల్25 (ప్రభ న్యూస్) మండల కేంద్రమైన కోసిగి శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఆవరణంలో జరిగిన లోకేష్ యువగలం బహిరంగ సభ అనంతరం తెలుగు తమ్ముళ్లు మధ్య ఘర్షణ చోటు చేసుకునింది. తెలుగు తమ్ముళ్లు రెండు వర్గాలు ఒకరిపై ఒకరు కట్టెలతో దాడిచేసుకున్నారు .యువగలం సభ దగ్గర కట్టిన బ్యానర్ల విషయంలో ఒకరిపై ఒకరు కట్టెలతో దాడిచేసుకోవడం జరిగింది.వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశారు..ఇందులో ఇరువర్గాల తెలుగు తమ్ముళ్లకు గాయలైనట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement