Thursday, May 9, 2024

మూడు రాజధానులు అనాలోచిత నిర్ణయం

అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు అనాలోచిత నిర్ణయం అని చిత్తూరు జిల్లా పిచ్చాటూరు టీడీపీ అడహాక్ కమిటీ సభ్యడు డి.ఇళంగోవన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన పిచ్చాటూరు టీడీపీ నాయకులు అడహాక్ కమిటీ సభ్యడు డి.ఇళంగోవన్ రెడ్డి ఆధ్వర్యంలో  సోమవారం అమరావతి రైతులు తపపెట్టిన మహాపాదయాత్ర సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా టీడీపీ ప్రభుత్వం ప్రకటన చేసే సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మద్దుతు పలికారని అన్నారు. అయితే, అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చి మూడు రాజధానులు తెరపైకి తీసుకువచ్చి ఆంద్ర రాష్ట్ర ప్రజలకు తీవ్ర మనోవేదనకు గురి చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement