Sunday, May 5, 2024

Srikakulam జిల్లాలో 2529 మందికి ఈబిసి నేస్తం …

(ప్రభ న్యూస్ బ్యూరో) శ్రీకాకుళం, : జిల్లాలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన 2,529 మందికి మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి గురువారం రూ.378.35 లక్షలను విడుదల చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లె లో జరిగిన ఈ కార్యక్రమంలో, ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారం చేసిన అనంతరం కలెక్టర్ మనజీర్ జిలాని సామాన్ లబ్ధిదారులకు ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును అందజేశారు.

కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం ఈడి గెడ్డమ్మ, కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, పొందర కూరాకుల కార్పొరేషన్ చైర్ పర్సన్ రాజాపు హైమావతి, టి.కామేశ్వరి, పలువురు అధికారులు, సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement