Sunday, April 28, 2024

Chelsea Islen : మ‌హేష్ స‌ర‌స‌న ఇండోనేషియా బ్యూటీ…

సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తన కొత్త సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే పలువురు విదేశీ టెక్నీషియన్స్ తో చర్చించి అగ్రిమెంట్లు కూడా జక్కన్న చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫారిన్ యాక్టర్లను కూడా ఇండియా రప్పించనున్నారు.

అయితే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఎవరు హీరోయిన్ గా నటించనున్నారోనని సినీ ప్రియుల్లో చాలా క్యూరియాసిటీ ఉంది. ఇక SSMB 29 మూవీకి హీరోయిన్ గా ఇండోనేషియాకు చెందిన బ్యూటీని రాజమౌళిని సెలెక్ట్ చేసినట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. చెల్సియా ఇస్లెన్ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నటించనుంది. ఇటీవల ఈ బ్యూటీ స్క్రీన్ టెస్ట్, లుక్ టెస్ట్ కూడా జరిగిందని సమాచారం. దీంతో ఈ ఇండోనేషియా అమ్మడు కోసం సినీ లోకం ఎదురుచూస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement