Sunday, April 28, 2024

Sri Satya జిల్లాలో మహిళలకే మకుటం

శ్రీ సత్యసాయి బ్యూరో – (ప్రభన్యూస్):రానున్న సార్వత్రిక ఎన్నికలలో శ్రీ సత్య సాయి జిల్లాలో అధికార, ప్రతిపక్ష పార్టీలు మహిళలకు అధిక ప్రాధాన్యతనిచ్చాయి. జిల్లాలోని ఏకైక లోకసభ స్థానం హిందూపురం తో పాటు మరో నాలుగు అసెంబ్లీలను ఇరు పార్టీల తరఫున మహిళలే పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగా హిందూపురం లోక్సభ స్థానానికి అధికార వైకాపా జె. శాంతమ్మ ను ఎంపిక చేయగా పెనుకొండ, హిందూపురం అసెంబ్లీ స్థానాల నుంచి సైతం మంత్రి ఉషశ్రీ చరణ్, దీపిక వేణు రెడ్డిలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించి రాప్తాడులో పరిటాల సునీతమ్మ,పెనుకొండలో సవితమ్మ, పుట్టపర్తి లో పల్లె సింధూర రెడ్డి, కదిరిలో కందికుంట యశోదాదేవి లను తమ పార్టీ అభ్యర్థినులుగా ప్రకటించడం విశేషం.ఇలా శ్రీ సత్య సాయి జిల్లాలో మహిళలకు అధికార, ప్రతిపక్షాలు ప్రాధాన్యతనివ్వడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement