Sunday, May 19, 2024

AP | అన్నవరం దేవస్థానం తరఫున దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పణ

ఎన్టీఆర్‌ ప్రభ న్యూస్‌ బ్యూరో: అన్నవరం శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం తరఫున ఆలయ ఈవో, శరన్నవరాత్రుల చీఫ్‌ ఫెస్టివల్‌ ఆఫీసర్‌ ఎస్‌.ఎస్‌.చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఆధ్వర్యంలో క్రనకదుర్గమ్మకి పట్టు వస్త్రాలు సమర్పించారు. అన్నపూర్ణాదేవి అలంకృత అమ్మవారికి మంగళవారం పట్టు వస్త్రాలు సమర్పించి, అమ్మవారిని దర్శించుకున్నారు. అంతరాలయంలో దర్శనం అనంతరం అన్నవరం దేవస్థానం ప్రతినిధుల బృందానికి వేద పండితులు ఆశీర్వచనం అందించారు.

అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందించారు. ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకున్నట్లు ఆజాద్‌ తెలిపారు. ఈ విశేష కార్యక్రమంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పాలకమండలి చెర్మన్‌ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణ అధికారి కె.ఎస్‌.రామారావు, ఆలయ అధికారులు, వైదిక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement