కర్నూల్లో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ముగ్గురు మహిళల మృతదేహాలు వెలుగు చూశాయి. కర్నూలు(మ) గార్గేయపురం చెరువులో గుర్తు తెలియని ముగ్గురు మహిళల మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. ముందుగా ఒకే ప్రాంతంలో రెండు మృత దేహాలు గుర్తించారు పోలీసులు.
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2024/05/Untitled-2-copy-2-1024x768.jpg)
వెలికి తరలిస్తుండగా చెరువుకు అవతలి ఒడ్డున మరో మహిళ గుర్తించారు. మహిళలపై ఎలాంటి గాయాలు కనిపించలేదు.
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2024/05/asdfasf-1024x768.jpg)
ముగ్గురు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారా…ప్రమాదవశాత్తు పడిపోయారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2024/05/asdfsafsa-1-1024x736.jpg)