Saturday, April 27, 2024

రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పిన జగన్, చంద్రబాబు

రాఖీ పౌర్ణమిని పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల సీఎం లు వైఎస్ జగన్, కేసీఆర్‌తోపాటు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ భారతీయ సంప్రదాయ ఔన్నత్యానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఏపీ ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్.. మహిళా సాధికారతకు ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ఎదిగేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.టీడీపీ చీఫ్ నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. కులమతాలకు రాఖీ పండుగ అతీతమని చెప్పారు. మానవీయ సంబంధాలను రాఖీ పండుగ మరింత పటిష్టం చేస్తుందన్నారు. భారతీయ జీవన ఔన్నత్యానికి రక్షాబంధన్ నిదర్శనమని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీశ్ రావు

Advertisement

తాజా వార్తలు

Advertisement