Wednesday, May 8, 2024

ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీశ్ రావు

నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీశ్‌ రావు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎగ్జిబిషన్‌ సొసైటీ యాజమాన్య కమిటీ ప్రకటించింది. అధ్యక్షుడిగా ఉండేందుకు అంగీకరించినందుకుమంత్రి హరీశ్‌ రావుకు సొసైటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ  ఎగ్జిబిషన్ సోసైటీ మరింత పథంలో నడిచేలా కృషిచేస్తానని అన్నారు. ఎగ్జిబిషన్ సోసైటీని మరింత ముందుకు తీసుకెళ్తానన్నారు. గత 80 ఏళ్లుగా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ను ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ సహకారంతో నుమాయిష్‌ను విశ్వవ్యాప్తం చేద్దామన్నారు. సొసైటీ విద్యాసంస్థల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని చెప్పారు. వృత్తి నైపుణ్యం మెరుగుపడి ఉపాధి అవకాశాలు పొందేలా వారిని తీర్చిదిద్దుదామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement