Saturday, April 27, 2024

గూడూరు మున్సిపాలిటీ టిడిపి ఇంచార్జిగా గోచిపాతల మోషే..

కందుకూరు : ఏప్రిల్‌ 17న జరుగనున్న తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అభ్యర్ధి పబాక లక్ష్మి విజయాన్ని కాంక్షిస్తూ గూడూరు మున్సిపాలిటీ ఇంచార్జిగా నియమించినందుకు గాను తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడుకు, ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు డాక్టర్‌ నూకసాని బాలాజీకి, నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు షేక్‌ అబ్దుల్‌ అజీజ్‌ మరియు కందుకూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్‌ దివి శివరాంకు గోచిపాతల మోషే హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గూడూరు మున్సిపాలిటీ ఇంచార్జిగా తనను నియమించినందుకు పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి పనబాక లక్ష్మి విజయం కోసం కష్టపడి పనిచేస్తానని, అలాగే గూడూరు మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీ సాధించేందుకు శక్తికి మించి కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ ఎస్‌.సి సెల్‌ జిల్లా కార్యదర్శి గోచిపాతల మోషే తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement