Saturday, April 27, 2024

విద్యుత్ సార్ట్ సర్క్యూట్ తో క్లీన‌ర్‌ మృతి..న‌లుగురికి గాయాలు

అద్దంకి : ప్ర‌కాశం జిల్లా అద్దంకి మండలంలోని చినకొత్తపల్లి గ్రామ సమీపంలోని నామ్ రోడ్ లో ఈశ్వర్ పెట్రోల్ బంక్ స‌మీపంలో ఓ లారీ విద్యుత్ షార్ట్ స‌ర్క్యూట్‌కు గురైంది. ఈ ప్ర‌మాదంలో క్లీన‌ర్ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. న‌లుగురు గాయాల‌పాల‌య్యారు. వ‌రికోత‌ల సీజ‌న్ కావ‌డంతో తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో వరి పంట కోతలకు వరి కోసే యంత్ర పరికరాలతో తమిళనాడు రాష్ట్రంలోని సేలం నుంచి అయిదుగురు వ్య‌క్తులు వరి కోత మిషన్ లను లారీలో తీసుకుని వెళ‌తున్నారు. ఈ క్ర‌మంలో గురువారం తెల్లవారు జామున చినకొత్తపల్లి గ్రామం సమీపంలో విద్యుత్ తీగలు వరికోత యంత్ర పరికరానికి తగిలి సార్ట్ సర్క్యూట్ కావడంతో తమిళనాడు రాష్ట్రం తెంగాఫీ జిల్లా అలాంగుల గ్రామానికి లారీ క్లినర్ సల్లాఛ్చన్ (48) అక్కడి కక్కడే మృతి చెందాడు. మిలిగిన 4 గురి కి స్వల్ప గాయాలు అయ్యాయి.సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిసీలించి మృతి చెందిన సల్లాఛ్చన్ మృత దేహాన్ని పోస్టు మార్టు నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ యువరాజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement