Sunday, April 28, 2024

శ్రీశైలంకు కాలినడకన వెళ్తూ గుండెపోటుతో భక్తుడి మృతి

కర్నూలు జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని వెంకటాపురం నుండి శ్రీశైలంకి కాలినడక వెళ్లే మార్గంలో నాగలూటీ నుండి పంగిడి బేస్ క్యాంప్ మార్గ మధ్యలో నరేష్ అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఫారెస్ట్ అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మకూరు ఎస్సై వరప్రసాద్ వెంటనే తమ సిబ్బందితో అక్కడికి వెళ్లి మృతదేహాన్ని అటవీ నుంచి తీసుకవచ్చారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. మృతదేహంను వారి బంధువులకు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement