Saturday, March 23, 2024

రోడ్డు ప్ర‌మాదంలో న‌లుగురు దుర్మ‌ర‌ణం.. ప్ర‌కాశం జిల్లాలో ఘ‌ట‌న‌

ఎర్ర‌గొండ‌పాలెం :
ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన సంఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. యర్రగొండపాలెం మండలం కొత్తపల్లి రహదారిపై కారు, ఆటో ఢీకొన్న సంఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు వైద్యశాలలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనలో మరో 10 మందికి తీవ్రగాయాలు కాగా వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతులు మొగుళ్లపల్లికి చెందిన కూలీలుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయ కార్యక్రమాలు చేపట్టారు. ప్రమాదానికి గత కారణాలను బాధితుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement