Wednesday, May 8, 2024

Nellore : టిడిపి నేత ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డిపై.. క‌ర్ర‌ల‌తో దాడి

టిడిపి నేత ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డిపై కొంద‌రు దుండ‌గులు నెల్లూరులో దాడికి య‌త్నించారు. ఆర్టీఏ కార్యాలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. బైకులపై వచ్చిన 10 మంది వ్యక్తులు కర్రలతో ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ దాడిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో ఆ వ్యక్తులు బైకులు, కర్రలు అక్కడే వదిలి పరుగులు తీశారు. వైసీపీ కార్యకర్తలే దాడికి యత్నించారని ఆనం అనుచరులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి జ‌గ‌న్ పై విమర్శలు చేసినందుకే దాడి చేసేందుకు వచ్చారని ఆరోపించారు. ప్రతి మాటలోనూ ఓ చమక్కుతో రాజకీయ ప్రత్యర్థులపై వాగ్బాణాలు సంధిస్తూ, అదే సమయంలో తన కామెడీ టైమింగ్ తోనూ అలరించే టీడీపీ నేతగా ఆనం వెంకటరమణారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement