Saturday, April 27, 2024

Rayalacheruvu: వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి మేకపాటి పర్యటన

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రాయల చెరువు సమీప ముంపు గ్రామాలలో జిల్లా ఇంచార్జి మంత్రి మేకపాటి గౌతం రెడ్డి పర్యటించారు. వరద ముంపుకు గురైన రామచంద్రాపురం మండలంలోని సీకాలేపల్లి, చిట్టత్తూరు, రాయలచెరువు, పుల్లమనాయుడుకండ్రిగ, తిరుపతి రూరల్ మండలం వినాయకనగర్ కాలనీలోని నిర్వాసితుల పరిస్థితిపై ఆరా తీశారు.

నిండుకుండను తలపిస్తున్న రాయలచెరువు ప్రమాద పరిస్థితులు నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఇన్చార్జి మంత్రి మేకపాటి ఆదేశించారు. NDRF బృందాలు, స్థానిక చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా అధికారుల పనితీరును మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మెచ్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement