Thursday, April 25, 2024

హైకోర్టు ఆదేశం.. రేపు కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ ఎన్నిక‌..

కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్‌ప‌ర్స‌న్‌, వైస్ చైర్మన్లకు సంబంధించిన ఎన్నికను రేపు (బుధవారం) చేప‌ట్టాల‌ని హైకోర్టు ఆదేశించింది. తెలుగుదేశం పార్టీ దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సంద‌ర్భంగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ , రిటర్నింగ్‌ అధికారి, విజయవాడ ఇన్‌చార్జి పోలీస్ క‌మిష‌న‌ర్‌ కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. విచార‌ణ అనంతరం రేపు కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికను నిర్వహించాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించింది.

ఈ మేరకు ఎన్నిక జరిపేలా మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించాలని ఎస్‌ఈసీకి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. పిటీషనర్లకు రక్షణ కల్పించాలని విజయవాడ సీపీని ఆదేశించింది. మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక ఫలితం ప్రకటించకుండా వివరాలు హైకోర్టు ముందు ఉంచాలని ఆదేశిస్తూ విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement