Tuesday, April 30, 2024

TS | సలేశ్వరం జాతరలో మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్ రాందాస్..

అచ్చంపేట, ప్రభ న్యూస్ : సలేశ్వరం జాతరలో అచ్చంపేట సర్కిల్ పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రామావత్ రాందాస్ మానవత్వం చాటుకున్నాడు. సలేశ్వరం జాతర ముగింపు సందర్భంగా.. నాగర్ కర్నూల్‌కు చెందిన 75 నుంచి 80 సంవత్సరాలు గల వృద్ధురాలు నడవలేని పరిస్థితులలో అవస్థలు పడడం చూసిన కానిస్టేబుల్ రాందాస్ చలించిపోయాడు.

తన ఉన్నతాధికారి అయిన అచ్చంపేట సీఐ రవీందర్ అనుమతితో ఆ వృద్ద మహిళను సలేశ్వరం జాతరలోని గుండం నుండి పైకి తన భుజాలపై మూసుకుంటూ వచ్చి నాగర్కర్నూల్‌కు పంపించడం జరిగింది. మానవత్వం, సేవాభావంతో వృద్ధురాలిని గుండం నుండి పైకి భుజాలపై మూసుకుంటూ వచ్చి.. నాగర్కర్నూల్‌కు పంపించడం ప్రజలు, ఉన్నతాధికారులను కానిస్టేబుల్ రాందాస్ కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement