Saturday, April 27, 2024

తండ్రి కోడుకులిద్దరూ జూమ్‌లో కాలక్షేపం: చంద్రబాబుపై కొడాలి నాని సెటైర్

రాష్ట్రంలోని రైతులకు 21 రోజుల్లోపు ధాన్యం డబ్బులు చెల్లిస్తున్నామని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌ ఇంటికి పరిమితమై జూమ్‌తో టైంపాస్ చేస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. రైతులకు చంద్రబాబు పెట్టిన రూ. 4 వేల కోట్లు బకాయిలు చెల్లించామని వెల్లడించారు. చంద్రబాబు లేఖ రాసే సమయానికే 1600 కోట్లు చెల్లించామన్నారు. కేంద్రం ఇవ్వకపోయినా రైతులకు డబ్బు చెల్లిస్తున్నామన్నారు. కేంద్రానికి లేఖ రాయాలంటే చంద్రబాబుకు భయం ఏర్పడిందన్నారు. ఊక, ధాన్యానికి తేడా తెలియని వ్యక్తి చంద్రబాబు అని, లోకేష్‌ను అచ్చోసిన ఆంబోతులా వదిలారని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతల హత్యలు జరిగాయని గుర్తు చేశారు. గ్రామాల్లో ఘటనలను తమపై తమ ప్రభుత్వం ఆపాదించడం సమంజసమా ? అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement