Friday, April 19, 2024

పవన్ రానా కూడా రెడి అయిపోయారు !!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో అయ్యప్పన్ కొషియమ్ రీమేక్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్ నటిస్తోంది. అలాగే రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అయితే ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఈ సినిమా షూటింగ్ ను రీ స్టార్ట్ చేయడానికి యూనిట్ రెడీ అవుతోంది.

జూలై 11న హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా పవన్ కూడా అదే రోజు షూట్ లో పాల్గొనబోతున్నారు. దీనికోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేక పోలీస్ స్టేషన్ సెట్ ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ రానా మధ్య వచ్చే సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారట. అయితే ఈ సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని భావిస్తున్నారట మేకర్స్. ఇక మాజీ ఆర్మీ ఆఫీసర్ గా రానా, పోలీస్ ఆఫీసర్ గా కళ్యాణ్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement