Thursday, March 28, 2024

శేఖర్ కమ్ముల సినిమాపై ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ స్టార్ సినిమా ధనుష్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. త్రిభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఆరాధించే దర్శకులలో ఒకరు శేఖర్ కమ్ముల తో కలిసి పనిచేయడం ఎగ్జైటింగ్ గా ఉంది. నారాయణ దాస్ నారంగ్, రామ్ మోహన్ రావు లతో చేతులు కలపడానికి కూడా సంతోషిస్తున్నాను. వి.ఎస్.వి.సి.ఎల్.ఎల్. పి బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ త్రిభాషా చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు.

ఇక ఈ చిత్రం కు సంబంధించి ఎనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ సినిమాపై అంచనాలు బాగానే పెరుగుతున్నాయి. అలాగే ధనుష్ తెలుగులో స్ట్రైట్ గా చేస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. కాగా ఈ సినిమాలో సాయి పల్లవి నే హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement