Wednesday, May 15, 2024

కుప్పంలోనూ తామే గెలుస్తామ‌న్న మంత్రి బాలినేని

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల వేడి పెరుగుతోంది. అధికార‌, ప్ర‌తిప‌క్షాల నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. కుప్పంలో ఓటు అడిగే హక్కు వైసీపీకి లేదని టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ ఇప్పటికే వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ‌గా, వైసీపీ నేత‌లు లోకేశ్ పై తీవ్ర విమ‌ర్శలు గుప్పిస్తున్నారు. అయితే మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రతిపక్షం ఎన్నికుట్రలు చేసినా కుప్పంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం కొనసాగుతుందని, నెల్లూరు కార్పొరేషన్‌లో వైసీపీ విజయం పక్కా అని మంత్రి ధీమా వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కుప్పంలోనూ టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అక్కడ ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో లోకేశ్ ఓటుకు రూ. 5 వేలు పంచడం సిగ్గుచేటన్నారు. సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని చంద్ర‌బాబు.. రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. కుప్పం మునిసిపాలిటీని అభివృద్ధి చేసిన ఘతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని బాలినేని ట్వీట్ లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement