Tuesday, May 7, 2024

బాల్కసుమన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ‘బీజేపీ’

చెన్నూర్ శాసనసభ్యులు ,ప్రభుత్వ విప్ బాల్కసుమన్ చెన్నూర్ పట్టణంలో జరిగిన తెరాస పార్టీ ధర్నా కార్యక్రమంలో బీజేపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు తెరాస కార్యకర్తలు తమపై దాడులు చేసేవిధంగా ప్రసంగించారని స్థానిక పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసారు.ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంఛార్జి అందుగుల శ్రీనివాస మాట్లాడుతూ.. తెరాస పార్టీ చేపట్టిన ధర్నా,నిరసన కార్యక్రమంలో విప్ సుమన్ చేసిన వ్యాఖ్యలు విన‌లేని విధంగా ఉన్నాయ‌న్నారు.. కేవలం బీజేపీ పార్టీ నాయకుల పై పరోక్షంగా దాడులు చేసేవిధంగా ఉన్నాయని మండిప‌డ్డారు.. ఇష్టమైన రీతిలో కార్యకర్తల ను ఉసిగొలిపే సుమన్ పై చట్ట పరమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement