Friday, April 26, 2024

సామాజిక స్పృహతో పని చేసేవారే స్థానిక సంస్థ‌ల ప్రతినిధులుగా ఉండాలి

స్థానిక సమస్యలపై అవగాహనతో, సామాజిక స్పృహతో పని చేసేవారిని స్థానిక సంస్థల ప్రతినిధులుగా ఉండాల‌ని జ‌న‌సేన
అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నెల్లూరు నగర పాలక సంస్థతోపాటు 12 మున్సిపాలిటీలకు ఈ నెల 15వ తేదీన జరిగే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున అభ్యర్థులు బరిలో నిలిచారు. వీటితోపాటు మరికొన్ని పురపాలక, నగర పాలక సంస్థల్లోనూ, ప్రజా పరిషత్తుల్లో వచ్చిన ఉప ఎన్నికల్లో జనసేన పోటీలో నిలిచింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తమ పార్టీ అభ్యర్థులకు ఓ ప్రకటన ద్వారా అభినందనలు తెలిపారు…
నెల్లూరు కార్పొరేషన్ తోపాటు ఆకివీడు, బుచ్చిరెడ్డి పాళెం, జగ్గయ్యపేట, కొండపల్లి, గురజాల, దాచేపల్లి, కుప్పం, దర్శి, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీలతోపాటు, విశాఖ, గుంటూరు కార్పొరేషన్లు, రేపల్లె మున్సిపాలిటీల్లో ఉప ఎన్నికలు, పలు జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement