Sunday, April 28, 2024

తెలుగుదేశంలో చేరిన మ‌హాసేన రాజేష్..

సామ‌ర్ల‌కోట – దళిత నేతగా గుర్తింపు తెచ్చుకున్న మహాసేన రాజేష్ తెలుగుదేశం పార్టీలో చేరారు. సామర్లకోటలో ఇవాళ చంద్రబాబు దళిత సామాజికవర్గంతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో మహాసేన రాజేష్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజేష్ కు పార్టీ కండువా కప్పిన చంద్రబాబు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ, చీకటి వచ్చిన తర్వాతే వెలుగు విలువ తెలుస్తుందని, జగన్ అస్తవ్యస్త పాలన చూశాక చంద్రబాబు పాలన ఎంత గొప్పదో అర్ధమవుతోందని వ్యాఖ్యానించారు. జగన్ 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును దళితద్రోహిగా పేర్కొన్నారని, తాము కూడా జగన్ మాటలు నిజమే అని భావించామని అన్నారు. కానీ త్వరలోనే నిజమైన దళిత ద్రోహి ఎవరో గుర్తించామని పేర్కొన్నారు. జగన్ మాటలు నమ్మి చంద్రబాబును అపార్థం చేసుకున్నామని విచారం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement