Tuesday, April 16, 2024

ఎన్టీఆర్, వైఎస్ ల‌కు పురంధీశ్వ‌రీ జై – జివిఎల్ వ్యాఖ్య‌ల‌పై ఫైర్

అమ‌రావ‌తి – అన్నింటికీ ఇద్ద‌రి పేర్లేనా అంటూ బిజెపి ఎంపీ జీవీఎల్ చేసిన వ్యాఖ్యల‌పై అదే పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు పురందేశ్వరి ఫైర్ అయ్యారు. . ఆ ఇద్దరు కాదు..ఆ మహానుభావులు అని చెబుతూ..జీవీఎల్ కామెంట్ చేసిన వీడియో పోస్టు చేసి దానికి కౌంటర్ ఇచ్చారు.


ఆ ఇద్దరు కాదు, ఆ మహానుభావులు
“ఒకరు తెలుగు జాతికి గుర్తింపుని తీసుకొని వచ్చి, పేదలకు నిజమైన సంక్షేమం- 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివీ ప్రజలకు అందిస్తే, మరోకరు ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు, ఆరోగ్యశ్రీ అందించారు” అని జీవీఎల్‌కు కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు. జివిఎల్ చేసిన వ్యాఖ్య‌ల వీడియోను ఆమె త‌న ట్వ‌ట్ట‌ర్ ద్వారా షేర్ చేశారు. బిజెపిలో ఉంటూ వైఎస్ ని, ఎన్టీఆర్ ప‌థ‌కాల‌ను పురంథీశ్వ‌రీ స‌మ‌ర్ధించ‌డంలో రాజ‌కీయాల‌లో సంచ‌ల‌నం క‌లిగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement