Saturday, April 27, 2024

Adoni : లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్య…

ఆదోని : యువతి ఉరివేసుకొని, యువకుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గత రాత్రి ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస భవన్ లాడ్జిలో రూమ్ నెంబర్ 309 లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన మానసతో ఎమ్మిగనూరు మండలం దైవందీన్నే గ్రామానికి చెందిన రాముడుకు పరిచయం ఏర్పడింది. తిరుపతిలో కోచింగ్ కి వెళ్ళిన రాముడుతో మానసకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది.

అయితే ఏం జరిగిందో ఏమో మానసను ఆదోనికి పిలిపించుకొని లాడ్జిలో ఉంటూ.. వారిద్దరిలో మానస ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. రాముడు బిర్యానిలో పురుగుల మందు కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఈరోజు ఉదయం తలుపు తెరవకపోవడంతో లాడ్జ్ నిర్వాహకులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో రెండవ పట్టణ సీఐ శ్రీనివాస నాయక్ సంఘటన స్థలానికి వెళ్లి ఆరా తీసి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. మృతుడు రాముడుకు గత నెల క్రితం సంఘాల గ్రామానికి చెందిన రమాదేవి అనే యువతీతో వివాహమైనట్లు తెలిసింది. మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement