Wednesday, May 8, 2024

మన్యంలో మావోయిస్టుల పేరిట లేఖలు

విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో మావోయిస్టు విశాఖ ఈస్ట్ డివిజన్ కమిటీ పేరిట పోస్టర్లు వెలిశాయి. జి. మాడుగుల మండలం మద్దిగారు గ్రామ పరిసర ప్రాంతాల్లో పోస్టర్లు అతికించారు. ఇందులో మావోయిస్టులు.. ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచారు.

ఆంధ్రా – ఒడిశా సరిహద్దు రాష్ట్రాల్లో కొవిడ్ ఆస్పత్రుల నిర్మాణంపై లేఖలో ప్రస్తవించారు. ప్రభుత్వ వైద్యులపై పని భారం తగ్గించాలని, ప్రైవేటు వైద్య కళాశాలలను స్వాధీనం చేసుకుని ప్రజలకు ఉచిత వైద్యం అందించాలని పేర్కొన్నారు. వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురావటంతో పాటు తయారీ సంస్థలకు తక్షణం అనుమతులు ఇవ్వాలన్నారు. ఏపీలో పది, ఇంటర్ పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేయాలని స్పష్టం చేశారు. రైతుల రుణలను మాఫీ చేయాలని, రైతులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని సూచించారు. కరోనా వేళ కార్పొరేట్ సంస్థలకు ఇచ్చే ప్రోత్సాహకాలను రద్దు చేయాలని, అక్రమ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో కూంబింగ్​ను వెంటనే ఆపాలని లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement