Sunday, May 5, 2024

ఆనందయ్య ముందుపై ఐదు రోజుల్లో తుది నివేదిక

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆనందయ్య నాటు మందుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయుష్‌ కమిషనర్‌ రాములు కృష్ణపట్నం ఆనందయ్య ఔషధంపై సీఎంతో చర్చలు జరిపారు. ఆనందయ్య ఔషధంపై ఐదారు రోజుల్లో తుది నివేదిక అందిస్తామని రాములు తెలిపారు. చట్టపరంగా మాత్రం ఆయుర్వేద ఔషధంగా చెప్పలేమని అన్నారు. క్లినికల్‌ ట్రయల్స్ జరిగాకే ఆయుర్వేద ఔషధంగా చెప్పగలమని స్పష్టం చేశారు. ఔషధంలో వాడే మూలికలు ఆయర్వేద గ్రంథాల్లో ఉన్నవేనని, ఆనందయ్య ఔషధంలో హానికరమైన పదార్థాలు ఏమీ లేవు అని స్పష్టం చేశారు. ఆనందయ్య ఔషధంతో లబ్ధి జరిగిందని ఎక్కువ మంది చెబుతున్నారని రాములు తెలిపారు.

 ఆనందయ్య మందును తాము తక్కువచేసి చెప్పడం లేదు, అలాగని కించపరచడం లేదని పేర్కొన్నారు. ఆనందయ్య ఔషధం గురించి సీఎం జగన్ తో చర్చించామని, పరిశోధన త్వరగా పూర్తిచేయాలని చెప్పారని వెల్లడించారు. ఆనందయ్య మందుతో ఎలాంటి ప్రమాదం లేదని తేలిన తర్వాతే ప్రజలకు పంపిణీ ఉంటుందని స్పష్టం చేశారు.  సీసీఆర్ఏఎస్ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఆనందయ్య మందును ఇప్పటివరకు 80 వేల మందికి పంపిణీ చేసినట్టు చెబుతున్నారని, వేల మందిలో ఒకరిద్దరికి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని, ఇదేమంత పెద్ద విషయం కాదని పేర్కొన్నారు. ఆనందయ్య మందు వాడిన 500 మంది డేటా సేకరించామని తెలిపారు. ఇప్పటికే మందులో వాడిన 18 రకాల మూలికలపై అధ్యయనం చేశామని రాములు నాయక్ చెప్పారు.

కాగా, ఆయూష్ ప్రతినిధుల సమక్షంలో ఆనందయ్య తన మందును తయారు చేశారు. మందులో వాడుతున్న మూలికలను, తయారీ పద్ధతిని ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు ఇప్పటికే పరిశీలించారు. ఈ మందులో ఎలాంటి హానికర పదార్థాలను వాడటం లేదని గుర్తించారు. మరోవైపు ఐసీఎంఆర్ బృందం కూడా ఈ మందును పరిశీలిస్తోంది. అయితే ఐసీఎంఆర్ ఏం నివేదిక ఇస్తుందన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇదీ చదవండి: తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ పొడిగించే ఛాన్స్ ?

Advertisement

తాజా వార్తలు

Advertisement