Saturday, May 4, 2024

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. కర్నూల్‌ రేంజ్‌ డీఐజీ సెంథిల్‌ కుమార్‌

కర్నూలు : విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరులను స్మరించుకోవడం మన బాధ్యత అని, వారు చేసిన త్యాగాలు, సేవలు మరువలేనివని కర్నూల్‌ రేంజ్‌ డీఐజీ ఎస్‌.సెంథిల్‌ కుమార్‌, జిల్లా కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు, జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా శుక్రవారం స్ధానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని పేరడ్‌ మైదానంలో అమరవీరుల స్ధూపం వద్ద స్మృతి పరేడ్‌ నిర్వహించారు. కర్నూలు రేంజ్‌ డీఐజీ ఎస్‌.సెంథిల్‌ కుమార్‌, జిల్లా కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు, జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌, స్మృతి పరేడ్‌కు హాజరై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కర్నూలు రేంజ్‌ డిఐజి సెంథిల్‌ కుమార్‌ మాట్లాడుతూ… పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించుకుంటామన్నారు. ప్రతి ఏడాది ఈ అక్టోబర్‌ 21న పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని దేశం మొత్తం జరుగుతుందన్నారు. 1959లో అక్టోబర్‌ 21న చైనా సైనికులను ఎదిరించి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన పోలీసు వారి ధైర్యాని, త్యాగాన్ని అమరవీరుల స్మారక దినంగా మన దేశం గత 62 ఏళ్లుగా గుర్తు చేసుకుంటు-ందన్నారు. ఈ రోజు నుండి ఈ రోజు వరకు ప్రజల సేవలో ప్రాణాలు వదిలిన ప్రతి పోలీసు, ప్రతి పోలీసు కుటు-ంబానికి మొత్తం సమాజం జేజేలు పలుకుతుందన్నారు. గత ఏడాది కాలంగా దేశ వ్యాప్తంగా 261 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులైతే అందులో 8 మంది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వారు అందులో మన కర్నూల్‌ రేంజ్‌ పరిధిలో కానిస్టేబుల్‌ జి.సురేంద్రనాథ్‌ – నంద్యాల జిల్లా, హోంగార్డు కె. రాజశేఖర్‌ – కర్నూలు జిల్లా వీరిద్దరు అమరులైనారన్నారు.

అమరవీరుల కుటు-ంబాలకు ఎల్లవేళల అండగా ఉండి పిల్లల చదువులకు అవసరమైన ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. ఫ్యామిలి నందు ఒక్కరికి ఉద్యోగం, భద్రత నుండి రూ.8 లక్షలు, ఫ్యామిలికి నెలనెల పెన్షన్‌, పోలీసు శాలరీ ప్యాకేజ్‌ నుండి రూ.3 లక్షలు, అంత్యక్రియలకు రూ.25 వేలు, ఫ్లాగ్‌ ఫండ్‌ నుండి రూ.25 వేలు, విడో ఫండ్‌ నుండి రూ.50 వేలు ఈ విధంగా అమరులైన పోలీసు కుటు-ంబాలకు చేయూతగా ప్రభుత్వం ద్వారా సాయం అందిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ… 1959 అక్టోబర్‌ 21న జరిగిన దురదృష్ట సంఘటనను గుర్తు చేసుకుంటూ వారి త్యాగాలను సంస్మరణం చేసుకోవడం కోసం ప్రతి ఏటా ఈ రోజున పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటు-న్నామన్నారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని శాంతి భద్రతల కట్టడిలో పోలీస్‌ వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తుందన్నారు. , జిల్లా ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్‌ మాట్లాడుతూ… భారత్‌ – చైనా సరిహద్దు లఢఖ్‌లోని హాట్‌ స్రింగ్‌ వద్ద పోలీసు పెట్రోలింగ్‌ పహారాలో ఉన్నటు-వంటి జవానులపై శత్రువులు దాడి చేయగా ధైర్యసాహసాలతో వారి పై ప్రతి దాడి చేస్తూ తమ చివరి రక్తపుబొట్టు- వరకు పోరాడి వీరమరణం పొందారన్నారు. వారు ఆ రోజు చేసిన అంతిమ త్యాగాలను గుర్తించి, గౌరవించి, దేశ వ్యాప్తంగా అమరవీరుల దినోత్సం రోజును జరుపుకుంటూ అమరవీరులకు శ్రధ్దాంజలి నిర్వహిస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement