Saturday, May 18, 2024

వడ్డీ రేటు య‌ధాత‌థ నిర్ణ‌యం ఎన్నిక‌ల స్టంటే….

క‌ర్నూలు – చిన్న మొత్తాలపొదుపు పథకాలపై వడ్డీరేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం వెనక్కు తీసుకో వడం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నదే న ని కేంద్ర ప్రభుత్వం యి టువంటినిర్ణయాలవాళ్ల ప్రజలను మోసం చేయలేరని సి ఐ టి యు నగర కార్యదర్శి ఎం ,డి ,అంజిబాబు అన్నారు ,కె ,కె భవన్ నందు జరిగిన ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమావేశంలో లో ఆయన మాట్లాడుతూ తూ భవిష్యత్తు భద్రత కోసం కోట్లాదిమంది ప్రజలు పొదుపు పథకాల్లో డబ్బులు దోచుకున్నారని అయితే వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా ప్రజలు తీవ్రంగా నష్టపోతారని అన్నారు సీనియర్ సిటిజన్స్ జీవనోపాధి దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ప్రధాని సన్నిహితులకు పన్ను మినహాయింపు ఇస్తూ కార్పొరేట్ల లాభాలను పెంచడమే ధ్యేయంగా పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా దేశ ఆస్తులను డ్యూటీ చేస్తుందని ఎన్నికల తర్వాత ప్రభుత్వం వడ్డీరేట్లను తగ్గించే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై పూర్తిగా వెనక్కి తగ్గిన వరకు ప్రజలు ఆందోళనకు సిద్ధం కావాలని ఆయన కోరారు

Advertisement

తాజా వార్తలు

Advertisement