Thursday, May 16, 2024

Crime: ఎస్పి పేరుతో వసూళ్లు.. కర్నూల్ తాలూక సీఐపై కేసు నమోదు

కర్నూలు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి పేరుతో కర్నూల్  తాలూకా అర్బన్ సీఐ కంబగిరి రాముడు అవినీతి బాగోతం బయటపడింది. జిల్లా ఎస్పి సుధీర్ కుమార్ రెడ్డి సీఐపై అదే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 19న కర్నూలు మండలం పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద SEB అధికారులు హైదరాబాద్ నుంచి తమిళనాడు వెళ్తున్న బస్సును  తనిఖీ చేశారు. తమిళనాడుకు చెందిన సతీష్ బాలకృష్ణ అనే ప్రయాణికుడు వద్ద రూ.75 లక్షలు గుర్తించారు. సెబ్ అధికారులు డబ్బుతో పాటు ఆ వ్యక్తిని కర్నూల్ తాలూకా అర్బన్ పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన నగదుకు సంబంధించిన పత్రాలను అతను పోలీసులకు చెప్పారు. సీఐ కంబగిరి రాముడు మొత్తం సొమ్ము తిరిగి ఇవ్వకుండా జిల్లా ఎస్పీకి ఇవ్వాలంటూ రూ.15లక్షలు బలవంతంగా తీసుకున్నారు. అందులో ఐదు లక్షలు ముగ్గురు మధ్యవర్తులు ఇచ్చారు. రూ.10 లక్షలు తన వద్ద ఉంచుకుని మిగిలిన 60 లక్షలను సతీష్ బాలకృష్ణకు ఇచ్చారు. దీనిపై బాధితుడు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

దీంతో విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పి సుధీర్ కుమార్ రెడ్డి సీఐపై అదే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చాలని ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. సతీష్ బాలకృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్సై లక్ష్మీనారాయణ సీఐతో పాటు ముగ్గురు మధ్యవర్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ విజయవాడకు వెళ్తున్నట్లు తెలుసుకొని అతను అరెస్టు చేసి తీసుకు వచ్చేందుకు జిల్లా రక్షణాధికారి ప్రత్యేక పోలీసు బృందాలను పంపారు. ఈ విషయం తెలుసుకున్న సిఐ పరారీలో ఉన్నట్లు సమాచారం. ముగ్గురు మధ్యవర్తులను అదుపులోకి తీసుకుని క్షేత్రస్థాయిలో విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement