Thursday, May 16, 2024

శ్రీశైలంలో కుంభోత్సవం.. గుమ్మడి, కొబ్బరి, నిమ్మకాయలు, అన్నపురాశి సమర్పణ

కర్నూలు, (ప్రభ న్యూస్ బ్యూరో) : లోక కల్యాణం కోసం శ్రీశైల భ్రమరాంబికదేవికి మంగళవారం సంప్రదాయబద్ధంగా వార్షిక కుంభోత్సవం నిర్వహించారు. ప్రతీ చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే రోజున అమ్మవారికి సాత్విక బలిని సమర్పించడం విశేషం. ఆచారంలో భాగంగా నిర్వ‌హించిన ఉత్సవంలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు , నిమ్మకాయలు , అన్నపురాశి మొదలైనవి అమ్మవారికి సాత్విక బలిగా సమర్పించారు. ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి ఎస్ లవన్న , ధర్మకర్తల మండలి అధ్యక్షుడు చక్రపాణిరెడ్డి త‌దిత‌రులుల పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement