Sunday, May 12, 2024

ఆసుపత్రి వద్ద రెండువర్గాల డిష్యూం.. డిష్యూం..

కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రెండువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 10 మంది యువకులు ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లుతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రిలోకి చొరబడిన ఒక వర్గం యువకులపై మరోవర్గం దాడి చేసింది. రెండు వర్గాల దాడిలో ప్రభుత్వ ఆసుపత్రి అద్దాలను కొందరు యువకులు ధ్వంసం  చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement