Sunday, April 28, 2024

మేనేజర్‌ రూమ్‌ ముందు బైఠాయించిన దంపతులు..

కాసిపేట : మందమర్రి ఏరియా కల్యాణిఖని ఓసి గనిలో ఉద్యోగం కల్పించాలని కాసిపేట గ్రామానికి చెందిన దంపతులు గని మేనేజర్‌ కార్యాలయం ముందు బైటాయించారు. మండలంలోని కాసిపేట గ్రామానికి చెందిన నగురారపు సుమన్‌ కు చెందిన భూమి ఓసిలో ముంపునకు గురవుతున్నదని దానికి సంబందించిన నష్ట పరిహారం చెల్లించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నష్ట పరిహారం చెల్లించక పోగా ఓసిలో ఉద్యోగవకాశం కల్పిస్తామనిన అధికారులు మాట తప్పడంతో ఆవేదన చెంది నిరసనకుదిగినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గని మెనేజర్‌ మల్లయ్య , పరిహారం, ఉద్యోగ విషయంపై అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రస్తుతం నెలకు ఆరు వేల రూపాయలు భృతిగా అందిస్తామని చెప్పారని .. దానికి అంగీకరించ లేదని సుమన్‌ తెలిపారు. త్వరగా సమస్య పరిష్కారించాలని లేకుంటే కార్యాలయం ముందు మరోసారి అందోళనలు చేపడతామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement