Saturday, April 27, 2024

లారీ, బ‌స్సు ఢీ : 10మందికి తీవ్ర‌గాయాలు

లారీ, బ‌స్సు ఢీకొని 10మంది తీవ్ర‌గాయాల పాలైన ఘ‌ట‌న క‌డ‌ప జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని రాయచోటి-వేంపల్లి ప్రధాన మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చక్రాయపేట మండలంలోని పాయలోపల్లి ఘాట్ వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. గాయ‌ప‌డ్డ వారిని చికిత్స నిమిత్తం లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చక్రాయపేట పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement