Sunday, May 5, 2024

ఎనిమిది మంది స్మగ్లర్లు అరెస్ట్.. ఎర్రచందనం, నగదు స్వాధీనం..

కడప బ్యూరో : జిల్లాలోని ప్రొద్దుటూరు, ఖాజీపేట అటవీ ప్రాంతాల్లో పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్త దాడులు చేసి ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 8 మంది స్మగ్లర్లు అరెస్ట్ చేశారు. వీరిలో అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ ఫకృద్దిన్ ఉన్నారు. గతంలో ఫకృద్దిన్ పైన జిల్లాలో 71 ఎర్రచందనం కేసులు నమోదు అయ్యాయి.

అరెస్ట్ అయిన వీరి వద్ద నుంచి 55 ఎర్రచందనం దుంగలు, 4 కార్లు, 9 లక్షల 50 వేలు నగదు, ఒక బైక్, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కడప ఎస్పీ అన్బురాజన్ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. విలేకర్ల సమావేశంలో యస్పీతో పాటు సబ్ డి.ఎఫ్.ఓ వివేక్, ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాద్ రావు, మైదుకూరు వంశీధర్ గౌడ్ లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement