Friday, April 26, 2024

ఆక్సిజన్ ట్యాంకర్లతో విశాఖ చేరిన ఐరావత్ నౌక

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. మహమ్మారి విలయానికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక వేల సంఖ్యలో కరోనా బాధితులు చినిపోతున్నారు. దీంతో ఆక్సిజన్ ట్యాంకర్లు, సిలిండర్లు, అత్యవసర ఔషధాలతో సింగపూర్ నుంచి ఈ నెల 5న బయలుదేరిన భారత నౌక ఐఎన్ఎస్ ఐరావత్ నిన్న విశాఖపట్టణం చేరుకుంది. నౌక మోసుకొచ్చిన వాటిలో 8 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు, 3,650 ఆక్సిజన్ సిలిండర్లు, కొవిడ్ మందులు, పీపీఈ కిట్లు ఉన్నాయి. వీటిని దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించనున్నారు.

దేశంలో కరోనాతో అల్లాడుతున్న వారిని రక్షించేందుకు తూర్పు నావికాదళం ‘’సముద్రసేతు-2’’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా 9 నౌకలు వివిధ దేశాలకు తరలివెళ్లాయి. అందులో ఐరావత్ ఒకటి. వివిధ దేశాల నుంచి సేకరించిన ద్రవ ఆక్సిజన్, కొవిడ్ ఔషధాలను సేకరించి భారత్ కు తరలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: కరోనా కోరల్లో మావోయిస్టులు

Advertisement

తాజా వార్తలు

Advertisement