Monday, April 29, 2024

క్రీడాశాఖ మంత్రిగా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించిన టీఎంసీ అభ్యర్థి, మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఇకపై మంత్రిగా కనిపించనున్నాడు. భారత్ తరపున మనోజ్ తివారీ 12 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2012లో ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో తివారీ సభ్యుడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో శివ్‌పూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన మనోజ్ తివారీకి మమతా బెనర్జీ మంత్రివర్గంలో చోటు లభించింది. సోమవారం ఆయన రాష్ట్ర యువజన, క్రీడాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ‘కొత్త ప్రయాణం మొదలైంది’ అంటూ ట్వీట్ చేశారు. ప్రమాణ స్వీకారం తనకు కొత్త అనుభూతన్నారు. తనపై నమ్మకంతో ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించిన మమత, తన సోదరుడు అభిషేక్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు మనోజ్ తివారీ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement