Thursday, May 9, 2024

దేశంలో కొత్తగా 3,29,942 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన ఆంక్షలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక గ‌డిచిన 24గంట‌ల్లో దేశం వ్యాప్తంగా 3,29,942 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఈ మహమ్మారి కారణంగా మ‌రో 3876మంది మృతి చెందారు.

కొత్త‌గా నమోదు అయిన కేసుల్లో అత్య‌ధికంగా క‌ర్ణాట‌క‌లో 39,305, మ‌హారాష్ట్రలో 37,236, త‌మిళ‌నాడు 28,978, కేర‌ళ 27,487కొత్త కేసులొచ్చాయి. ఇక కొత్తగా వచ్చిన కేసులలో 47శాతం కేసులు కేవ‌లం ఐదు రాష్ట్రాల నుండే రావటం గమనార్హం.

తాజా గణాంకాల ప్రకారం దేశంలో నమోదు అయిన మొత్తం కేసుల సంఖ్య 2,29,92,517కి చేరింది. అలాగే 37,15,221 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు మహమ్మారి కారణంగా 2,49,992 మృతి చెందారు. అలాగే కరోనా నుంచి కోలుకుని 1,90,27,304 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement