Friday, April 26, 2024

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రెండ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మహబూబ్ నగర్, జనగామ, సూర్యాపేట, యాదాద్రికి రెడ్ అలర్ట్ ప్రకటించారు. అలాగే ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్ కు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మరికొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement