Saturday, April 27, 2024

ఏపీ సమాచార కమీషనర్లుగా రేపే ప్రమాణం

ఏపీ రాష్ట్ర సమాచార కమీషనర్లుగా నియమితులైన యు.హరిప్రసాద్ రెడ్డి, కె.చెన్నారెడ్డిలు శుక్రవారం ప్రమాణం చేయనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12గం.లకు అమరావతి సచివాలయం మొదటి భవనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ చే హరిప్రసాద్ రెడ్డి,చెన్నారెడ్డిలతో రాష్ట్ర సమాచార కమీషనర్లుగా ప్రమాణం చేయించనున్నారు.

రాష్ట్ర సమాచార కమీషనర్ గా నియమితులైన కాకర్ల చెన్నారెడ్డి వైయస్సార్ కడప జిల్లా కలసపాడు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందినవారు. ఎంకామ్ ఎల్ఎల్బి విద్యార్హత కలిగి  రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో, జిల్లా కోర్టుల్లోనూ న్యాయవాదిగా పని చేశారు. వివిధ సివిల్,క్రిమినల్ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులతో పాటు మానవ హక్కుల కమీషన్, ఆర్బిట్రేషన్, భూ,రెవెన్యూ, లేబర్,వినియోగదారుల,పరోక్ష పన్నులకు సంబంధించిన పలు కేసుల పరిష్కారంపై కృషి చేశారు.

ఇక, మరో సమాచార కమీషనర్ గా నియమితులైన యు.హరిప్రసాద్ రెడ్డి సీనియర్ జర్నలిస్టుగా జర్నలిజం రంగంలో విశేష అనుభవం కలిగి ఉన్నారు. ఆయన జర్నలిజం రంగంలో సుమారు 20 ఏళ్లుగా కొనసాగారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి చరిత్ర విభాగంలో మాస్టర్ డిగ్రీ పొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement