Wednesday, May 15, 2024

జ‌డ్పీటిసి, ఎంపిటిసి ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించిన తెలుగుదేశం

అమ‌రావ‌తి – ఎపిలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న జ‌డ్పీటిసి, ఎంపిటిసి ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించాల‌ని నిర్ణ‌యించింది. గ‌త ఎన్నిక‌ల‌లో అధికార‌పార్టీ అరాచ‌కాల‌కు నిర‌స‌న‌గా ఈ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంటున్న‌ట్లు ఆ పార్టీ ప్ర‌క‌టించింది.. గ‌త రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ఉన్న స‌మ‌యంలోనే ఈ ఎన్నిక‌ల‌లో దౌర్జాన్యాల‌కు, అరాచ‌కాల‌కు వైసిపి పాల్ప‌డి ఏక గ్రీవాల‌ను చేసుకున్న‌ద‌ని పేర్కొంది.. ఇప్పుడు కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నీలం సాహ్నీఆధ్వ‌ర్యంలో జ‌రిగే ఎన్నిక‌ల‌లో మ‌రిన్ని అక్ర‌మాల‌కు, దౌర్జాన్యాల‌కు వైసిపి పాల్ప‌డ‌నుంద‌ని ఆరోపించింది.. ఈ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను మొత్తం ర‌ద్దు చేసి మొద‌టి నుంచి ఎన్నిక‌ల నిర్వ‌హించాల‌నే త‌మ డిమాండ్ ను తిర‌స్క‌రించ‌డంతోనే ఎన్నిక‌ల ఎలా జ‌ర‌గునున్నాయో తెలుస్తున్న‌ద‌ని టిడిపి పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement