Tuesday, May 7, 2024

పార్కుల అభివృద్దికి పాటుపడతా..

కవాడిగూడ : గాంధీనగర్‌ మున్సిపల్‌ డివిజన్‌లోని వివిధ ప్రాంతాలలోని మున్సిపల్‌ పార్కుల అభివృద్దికి పాటుపడతానని డివిజన్‌ కార్పోరేటర్‌ ఏ పావని వినయ్‌కుమార్‌ అన్నారు. డివిజన్ లోని వివిధ బస్తీలు, కాలనీలలో ఉన్న పార్కులను అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్కుకు వచ్చే వారికి అహాల్లాదం కలిగించే విధంగా పార్కులను తీర్చిదిద్దాల ఆమె అధికారులకు సూచించారు. డివిజన్ లోని సురభి పార్కు, కేనరాబ్యాంక్‌పార్కు, టిఆర్‌టి పార్కు, అశోక్‌నగర్‌ పార్కు, పిపుల్స్‌ పార్కు, జనతాపార్కులను త్వరలోనే అభివృద్ది చేయాలని నిర్ణయించినట్లు ఆమె వెల్లడించారు. పార్కులలో చెట్లు, పూల మొక్కలు, పచ్చిక బయళ్లు ఏర్పాటు చేసి అందంగా సుందరీకరణ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్‌ అధికారిణి, సత్యనారాయణమ్మ, మున్సిపల్‌ అధికారులు వెంకటేష్‌, సంజయ్‌, బిజెపి నేతలు వినయ్‌కుమార్‌, సురేందర్‌, శివకుమార్‌, సాయి, స్థానికులు విశ్వనాథ్‌, మరోహర్‌, సూర్యనారాయణ, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement